Skip to main content

Posts

Showing posts from June, 2023

TCS: Talent and Merit

HR head of India's largest IT company TCS E.S. Chakraborty and his three associates filled several thousand engineers in the company by taking bribe. Chakraborty has lost his job. Would you still say that all jobs in private companies are given on the basis of merit? And where money works, why won't kinship and caste work there? When there is no pressure to choose the best talent, then everything will work.

ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు రాసిన ఈ వాస్తవాలను తప్పక చదవండి

ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు రాసిన ఈ వాస్తవాలను తప్పక చదవండి.. 🙏🙏 ఎందుకు నేను బీజేపీపైనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను? ముఖం చూపించలేని వాళ్లు, సొంత పేర్లు చెప్పుకోలేని ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్,ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఎక్కువ వీడియోలు బీజేపీని ప్రశ్నిస్తూ ఎందుకు చేస్తున్నాను?  నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను.బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను.మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా.  ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు.రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే.  మత మార్పిడులు జరగకుండా హిందూ మత...

పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే ముఖ్యమట

*పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే ముఖ్యమట..* *రాష్ట్రాలకు బియ్యం ఇచ్చేదిలేదని తెగేసిచెప్పిన కేంద్రమంత్రి పీయూష్‌* ➡️కావాలంటే మార్కెట్లో కొనుక్కోండి ➡️ఓఎంఎస్‌ఎస్‌ ద్వారా విడుదలకూ నిరాకరణ ➡️క్వింటాల్‌కు రూ.3,400 చెల్లిస్తామన్నా ససేమిరా ➡️ఇథనాల్‌ కంపెనీలకు మాత్రం 2 వేలకే బియ్యం ➡️ఏటా లక్ష టన్నులకు పైగా సరఫరా చేస్తున్న కేంద్రం ➡️పేదల ఆకలి పట్టించుకోకుండా పెద్దలకు బియ్యం ➡️కేంద్రం తీరుపై పలు రాష్ర్టాల మండిపాటు ✴️కార్పొరేట్ల కనుసన్నల్లో మెలుగుతూ, పేదల ద్వేషిగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కోట్లమంది పౌరులు ఆకలితో అలమటించేలా చేసే ప్రమాదకర నిర్ణయం తీసుకొన్నది. ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమన్న ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తున్నది.  ✴️పేదలకు పంపిణీ చేసేందుకు బియ్యం కావాలని, ఎంత ధర అయినా ఇచ్చి కొంటామని రాష్ర్టాలు బతిమాలినా గింజ కూడా ఇచ్చేది లేదని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తేల్చి చెప్పారు.  ✴️అదే సమయంలో అడ్డికి పావుశేరుకాడికి ఇథనాల్‌ కంపెనీలకు నిరాటంకంగా లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా సరఫరా చేస్తూనే ఉన్నారు. ✴️పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే మ...

కల్పితాల్ని ప్రచారం చేసేవారంతా బీసీలకు శత్రువులే

* బీసీల్ని మభ్యపెడుతూ, వాస్తవాల నుండి దారిమళ్ళించే లా అవాస్తవాల్ని, అర్ధసత్యాల్ని, వాస్తవ వక్రీకరణల్ని, కల్పితాల్ని ప్రచారం చేసేవారంతా బీసీలకు శత్రువులే.* - 1.    *" బీసీ రిజర్వేషన్ల చరిత్ర తెలుసుకోండి" * అనే శీర్షికతో నిన్న కొన్ని బీసీ గౄపుల్లో ఒక పోస్ట్ సర్కులేట్ అయింది. ఇది మొదటి సారి కాదు. వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో "ఇదే పోస్ట్" గతంలో కూడా పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఒక లక్ష్యంతోనే, ఎవరో పనిగట్టుకుని, అసత్యాలు, అర్ధసత్యాలు, వాస్తవ వక్రీకరణలు, కల్పితాలతో దట్టించ బడిన ఈ పోస్ట్, అంబేద్కర్ గారు బీసీలకు ఏదేదో చేసేసారు అని, భ్రమ పడే విధంగా రూపొందించడం, దాన్ని పదేపదే ప్రచారంలో పెట్టడం, బీసీల్ని ప్రభావితం చేసి, వారి ఆలోచనల్ని ప్రభావితం చేసి, దారి మళ్ళించ డానికే కావచ్చు అనిపిస్తుంది. ఇది అభ్యంతరకరం.  2.    బీసీలకు మేలు చేసినంత వరకు, అంబేద్కర్ గారిని బీసీలు కూడా కృతజ్ఞతా భావంతోనే అభిమానిస్తారు. అయితే ఈవిధంగా జరుగుతున్న ప్రచారం లోని డొల్లతనం అర్థం అయినపుడు మాత్రం, బీసీలు ఈ  ప్రచారం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఖచ్చితంగా శంకిస్తారు. అవసరం అయినపుడు నిలదీస్తారు. వ...