*"జాగో(మేలుకో) తెలంగాణ*
*************************
*మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. యుద్ధ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరించాలి.*
**********************************
*ప్రెస్ నోట్* :
Date : 23-07-2033
మణిపూర్ రాష్ట్రం లో బీజేపీ పార్టీ మరియు బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం మెజారిటీ మైతీ ప్రజలను మతతత్వంతో ప్రేరేపిస్తూ మైనారిటీ గిరిజన కుకీలను హత్యాకాండ సాగిస్తున్నారు. కుకీ గిరిజన మహిళలపై మానభంగాలను భారీ ఎత్తున ప్రేరేపిస్తున్నారు. మానవ చరిత్ర లో హిట్లర్ కాలం నాటి దారుణాలను ఆధునిక యుగంలో మణిపూర్లో బిజెపి ప్రణాళిక బద్ధంగా ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మత విద్వేష ఎజెండాను కొనసాగిస్తుంది. వెళ్లడవుతున్న మణిపూర్ దారుణాలు కొన్ని మాత్రమే, వెల్లడి కాని వందల వేల ఘటనలు దాచబడుతున్నవి అనేకం. మణిపూర్ BJP ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ అమిత్ షా ల సూచనల మేరకు పోలీస్ అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ మారణ హోమాన్ని పట్టించుకోవడం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పకడ్బందీగా ఈ మారణ హోమాన్ని ప్రభుత్వం యంత్రాంగాలతో కలిసి సాగిస్తున్నాయి. మణిపూర్ లో రాజ్యాంగాన్ని ఎప్పుడో కాలరాచారు. మణిపూర్ లో జరిగే మారణ కాండ ను ఒక్కరోజులో ఆపే శక్తి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాకాని ప్రధాన మంత్రి మోడీ గారు 79 రోజులు అయినా నోరు విప్పరు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ మారణ హోమం కి తన ఆమోదం ఉందని మణిపూర్ బిజెపి ప్రభుత్వానికి గుజరాత్ గోద్రతరహాలో తెలియచేసిండు. గోద్ర మూడు నాలుగు రోజులైతే, మణిపూర్ ప్రత్యక్షంగా 80 రోజులుగా, పరోక్షంగా ఆరు నెలలుగా అట్టుడికి పోతుంది.
ఈ రోజు ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయినట్లు కనిపించినా, ఈ దారుణాలు దేశమంతటికీ బిజెపి మోడీ అమిత్ షాలు ప్రణాళిక బద్దంగా వచ్చే ఎన్నికల నాటికి వ్యాప్తి చేయబోతున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలోని కేంద్రం రాష్ట్రాల్లో ఉన్న బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరం, కుల మత జాతి తెగల భేదాలతో కలిసి జీవించే పరిస్థితులను, బిజెపి విధ్వంసం చేస్తుందని దేశ ప్రజలను జాగో తెలంగాణ హెచ్చరిస్తుంది.
ఈ సందర్బంగా జాగో తెలంగాణ
మణిపూర్ లో బిజెపి విద్వేష , మతతత్వ హత్యాకాండను ఖండిస్తూ ఈ క్రింది డిమాండ్స్ చేస్తుంది
1. మణిపూర్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి. కేంద్ర రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలపై స్థానికులకు , దేశ ప్రజలకు నమ్మకం పోయింది
2. మణిపూర్ లో గత నాలుగు నెలలుగా జరిగిన అన్ని హింసాత్మక సంఘటనలను సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి. తగు కఠిన చర్యలు చేపట్టాలి
3. మణిపూర్ పోలీస్ DGP ని బాధ్యులైన ఆయా పోలీస్ సూపెరింటెండెంట్లను తక్షణమె సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. పక్షపాత స్థానిక యంత్రాంగాన్ని పాలన నుంచి తప్పించాలి.
ఈ సందర్భంగా దేశం లో మతతత్వ విద్వేష విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పవలసిందిగా తెలంగాణ, దేశ ప్రజలను కోరుతున్నాం.
అట్లాగే అన్ని మతాలను గౌరవిస్తూ విద్వేషాలకు లోనవ్వకుండా అందరు సామరస్యంగా కలిసి మెలిసి
శాంతియుతంగా ఉండాలని జాగో తెలంగాణ వేదిక దేశ ప్రజలకు విఙ్ఞప్తి చేస్తుంది
ఇట్లు
జస్టిస్ చంద్రకుమార్ chairperson
ఆకునూరి మురళి IAS (retd) Convenor
*జాగో(మేలుకో) తెలంగాణ*
హైదరాబాద్ .
Comments
Post a Comment