T. Chiranjeevulu, IAS Ret.
ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైన మూడు స్తంభాలు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్య పరిరక్షణకు స్వతంత్ర న్యాయవ్యవస్థ వెన్నెముక లాంటిది. చట్టబద్ధమైన పాలన, పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ వంటివి న్యాయ వ్యవస్థ ప్రధాన విధులు .అలాంటి అత్యంత కీలకమైన న్యాయవ్యవస్థలో ఈ దేశం లొ 85 % శాతానికి పైగా ఉన్న బహుజనుల పాత్ర ఏమిటి? వాటా ఏమిటి? (ఇస్సా ఎంత?) న్యాయ పాలనలో బహుజనుల భాగస్వామ్యం అవసరం లేదా? స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి నేటి వరకు చూసినట్లయితే అగ్రవర్ణాలు / అగ్రకులాల ఆధిపత్యమే న్యాయ రంగంలో కొనసాగుతుంది . అడ్వకేట్స్ ల లో కూడా ఆధిపత్యం అగ్ర వర్ణాలు/కులాలదే.ఇంకా ఈ రంగము లొ సమాన అవకాశాలు.సామాజిక న్యాయం ఈ దేశ మెజారిటీ ప్రజలకు అందడం లేదు.సబార్డినేట్ కోర్టులలో / జిల్లా కోర్ట్ లలో రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ కీలక ఉన్నత న్యాయ స్థానాలైన హైకోర్టు మరియు సుప్రీం కోర్టులలో న్యాయమూర్తుల నియామకాలలో రిజర్వేషన్లు అమలులో లేకపోవడంతో ఈ రంగంలో బహుజనుల పాత్ర నామమాత్రంగా మిగిలిపోయింది .అగ్రవర్ణాల చేతులలోని న్యాయమును అర్థించాల్సిందే గాని ఆదేశించే స్థాయికి వారు ఇంకా చేరలేదు .వేల సంవత్సరాల కుల వ్యవస్థ కబంధ హస్తా ల లొ ఇంకా నలిగిపోతూనే ఉన్నారు. ఇవి కేవలం ఉద్యోగాలు కావు మన ఆత్మ గౌరవ చిహ్నానికి నిదర్శనాలు. మన లొ ఆత్మవిశ్వాసాన్ని నింపే రాజ్యాంగ బద్ధ మైన పదవులు.మన సామాజిక హోదా కు కొలమానాలు
స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఆవశ్యకత ను దృష్టిలో బెట్టుకొని రాజ్యాంగ నిర్మాతలు జడ్జి ల నియామకాల ను న్యాయ వ్యవస్థ కే వదిలి వేశారు. సుప్రీమ్ కోర్ట్ జడ్జి ల నియామకాల నిబంధనలను రూపొందించింది.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరు ఇతర సీనియర్ న్యాయమూర్తుల తొ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తమ రికమండేషన్లతో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటే అంతే మందిని ఎంపిక చేసి సుప్రీంకోర్టుకు పంపగా అక్కడ సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించి ,ఆమోదించి ప్రధానమంత్రి ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరుగుతుంది .రాష్ట్రపతి ఆమోదంతో వారు న్యాయమూర్తులుగా నియమింపబడే నోటిఫికేషన్ కేంద్ర న్యాయ శాఖ విడుదల చేస్తుంది. అలాగే సుప్రీంకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిల కొలీజియం ఎంపిక చేసి రాష్ట్రపతి ఆమోదం ద్వారా నియమించడం జరుగుతుంది. కొలీజియమనేది పూర్తిగా న్యాయమూర్తుల తో కూడి ఉంటుంది. ఇక్కడ ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర ఉండదు ,కొలీజియం సిఫారసులపై ఏమైనా రిమార్కులు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని ఇంటలిజెన్స్ రిపోర్టుల సహాయంతో కొలిజియం కు పంప వచ్చును.కానీ కొలీజియం సిఫారసులే ఫైనల్. అంటే న్యాయవ్యవస్థలో జడ్జిలే సుప్రీం.వారే జడ్జీలను నియమించుకుంటారు .ఒక విధంగా ఇది స్వతంత్ర న్యాయవ్యవస్థకు బలం చేకూర్చేదైన వాస్తవానికి ఇక్కడ ప్రతిభ కంటే జడ్జిలు వారి బంధువులనే నియమించుకుంటున్నారు అనే విమర్శలు అధికమై గా గలవు. అందులో అగ్ర వర్ణ/ కుల జడ్జిలదే ప్రధాన పాత్ర అని,న్యాయవ్యవస్థ కొన్ని కుటుంబాల చేతిలో బందీ అయిందని విమర్శలు గలవు. అంకుల్ జడ్జెస్ అనే పదం వ్యాప్తి లోకి వచ్చింది.ఈ మొత్తం ఎంపిక ప్రక్రియలో బీసీలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూలు తెగలకు లభిస్తున్న వాటా చూసినట్లయితే సామాజిక న్యాయం ఈ దేశంలో ఏ విధంగా అమలవుతుందో తేటతెల్లమవుతుంది.ఎందు కంటే ఈ వర్గాల నుంచి రిప్రెసెంటేషన్ లేనప్పుడు వీరి నియామకులు ఉండవు ఇది సత్యం.అందుకే న్యాయ వ్యవస్థ లొ జడ్జి ల నియామకం ల లో రిజర్వేషన్ ఉండాల్సిందే.ఈ క్రింది గణాంకాలు ఎందుకు అవసరమో తెలియ చేస్తాయి.
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1950 నుంచి 2022 వరకు హైదరాబాద్ స్టేట్, తెలంగాణ ,సంయుక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులకు 16 మంది న్యాయమూర్తులు ప్రమోట్ కాగా అందులో రెడ్డిలు ఏడు, కమ్మ మూడు, బ్రాహ్మణ రెండు, వేలమా ఒకటి, రాజు ఒకటి, ముస్లిం ఒకటి, షెడ్యూల్డ్ కులాలు ఒకటి. బీసీల నుంచి గాని ఎస్టీల నుంచి గాని ఒక్క అభ్యర్థి లేరు.
2. హైదరాబాద్ స్టేట్, సంయుక్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మొత్తం 42. ఇందులో 39 మంది ఓసీలు. బ్రాహ్మణులు 13, రెడ్లు 5, బనియాలు 5, కాయస్త 3, వెలమ/రాజు/రాజపుత్ర 3, కమ్మ 2, ముస్లింలు 2, పంజాబీలు 2, మహేశ్వరి 1, నాయర్ 1, మరాఠా 1, క్రిస్టియన్ 1, వెనుకబడిన తరగతుల నుంచి మొత్తం 3 ( అందులో ఒకరు కేరళ, మరొకరు తమిళనాడు, ఇంకొకరు తెలుగు వారు జస్టిస్ శ్రీ కొమరయ్య గారు) షెడ్యూల్ కులాల నుంచి షెడ్యూలు తెగల నుంచి ఒక్కరు లేరు
3. హైకోర్టు న్యాయమూర్తులు: 1950 నుంచి 2022 వరకు మొత్తం 204--- బ్రాహ్మణులు 50, రెడ్లు 37, కమ్మలు 21, క్షత్రియులు (వెలమ/రాజు/రాజపుత్ర) 14, ముస్లింలు 14, కాపు 11, బనియా 7, కాయస్థ 2, నాయర్ 2, పట్నాయక్ 1, బీసీలు 32, షెడ్యూల్ కులాలు 7, షెడ్యూల్ తెగలు 2.ఓసీ 4(కులాలు తెలియదు) జాగ్రత్తగా పై లెక్కలు గమనిస్తే 80% ఉన్న(ముస్లిం లు గాక)బీసీ,ఎస్సీ,ఎస్టీ లు 41 కాగా ఒక్క బ్రాహ్మణ కమ్యూనిటీ( 1% తెలంగాణ లో) నుంచి 50 మంది ఉన్నారు
( సేకరణ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు)
శ్రీ అర్జున్ రామ్ మెఘావాల్ కేంద్ర మరియు రాష్ట్ర న్యాయశాఖ మాత్యులు
13.12.2024 రోజున అన్ స్టార్డ్ ప్రశ్న 3117కు ఇచ్చిన సమాధానం ప్రకారం 2018 నుంచి 9.12.2024 వరకు మొత్తం 684 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా నియమింపబడినారు. అందులో
జనరల్ 530 (77.48%), ఓబిసి 82 (11.98%), షె.కు. 21 (3.07%), షె.తె 14 (2.04%), మైనారిటీ 34 (4 97).
అలాగే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల విషయంలో గత 72 సంవత్సరాల లో (2022 వరకు) నియమించిన 246 మంది జడ్జిలలో మహిళలు కేవలం 8 మంది మాత్రమే.
ఇది ఈ దేశంలోని న్యాయవ్యవస్థలో అమలవుతున్న సామాజిక న్యాయం. అందుకే అనేక కేసుల తీర్పులలో బీసీలకు న్యాయం జరగడం లేదనే బలమైన వాదం కలదు. EWS రిజర్వేషన్ పై సుప్రీం తీర్పును పదవి విరమణ చేసిన సుప్రీం కోర్ట్ న్యాయమూర్తు లే విమర్శించారు.స్వాతంత్రం వచ్చిన కొత్తలో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో చదువుకున్న వారు తక్కువ కాబట్టి ఆ రోజు అర్హులైన అభ్యర్థులు లేకపోయి ఉండవచ్చును. కానీ నేడు బిసి ఎస్సి ఎస్టి లలో చదువుకున్న అన్ని విధాల అర్హులైన అభ్యర్థులు గలరు.
న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 12 లోని రాజ్యం (State) నిర్వచనం లోకి వస్తుందని కేశవానంద భారతి కేసులో జస్టిస్ మాత్యు అభిప్రాయ పడినారు .అదే విషయాన్ని జస్టిస్ హిదాయతుల్ల మరియు ఇతర జడ్జిలు కూడా తర్వాత తీర్పులలో బలపరిచారు. న్యాయవ్యవస్థ రాజ్యంలో బాగం కాబట్టి ఇక్కడ వెనుకబడిన తరగతులకు ,షెడ్యూలు కులాలకు ,షెడ్యూలు తెగలకు ,మహిళలకు రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు అమలు పరచాలి అని అభిప్రాయం ప్రగాఢంగా వ్యక్తమవుతుంది.
శ్రీ విల్సన్ రాజ్యసభ సభ్యులు తమిళనాడు ఫిబ్రవరి 15, 2025న పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు 2024 ను ప్రవేశపెట్టినారు. ఇందులో న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు అమలు గురించి వారు తమ నిదానంగా వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఈ దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా ప్రాధాన్యత లభించేలా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొని రావాలి. అదేవిధంగా స్వతంత్ర జ్యూడిషల్ కమిషన్ ద్వారా అన్ని స్థాయి ల లో న్యాయవ్యవస్థ లో నియామకాలు జరపాలి లేనట్లయితే అణగారిన మెజారిటీ వర్గాలకు న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అందని ద్రాక్షపండే.సమ న్యాయం,సమాన అవకాశాలు డొల్లే.
ఈ దేశ మూల వాసిలైనా బహుజన బిడ్డలు ఈ రంగము లొ కూడా తమ న్యాయ మైన వాటా కోసం పోరాటం చేయాలి.అడగనిది అమ్మైనా పెట్టదు అనే విషయాన్ని గుర్తుంచు కోవాలి.
Comments
Post a Comment